India: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. లక్ష దాటిన యాక్టివ్ కేసులు

India reports 18819 fresh cases
  • గత 24 గంటల్లో 18,819 కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 13,827
  • ఇప్పటి వరకు 5,25,116 మంది మృతి
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 18,819 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 13,827 మంది కరోనా నుంచి కోలుకోగా... 39 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మరోసారి లక్షను దాటింది. ప్రస్తుతం దేశంలో 1,04,555 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,34,52,164కి పెరిగింది. వీరిలో 4,28,22,493 మంది కోలుకోగా... ఇప్పటి వరకు 5,25,116 మంది మృతి చెందారు. దేశంలో పాజిటివిటీ రేటు 4.16 శాతంగా, రికవరీ రేటు 98.55 శాతంగా, క్రియాశీల రేటు 0.24 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,97,61,91,554 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 14,17,217 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
India
Corona Virus
Updates

More Telugu News