Mahesh Babu: చారిత్రక నేపథ్యంలో మహేశ్ బాబు మూవీ!

  • త్రివిక్రమ్ సినిమా కోసం రెడీ అవుతున్న మహేశ్ 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళుతున్న ప్రాజెక్టు 
  • మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే టాక్
  • ఒక కథానాయికగా పూజ హెగ్డే 
  • మరో కథానాయికకు దక్కనున్న చోటు
Mahesh Babu and trivikram project update

త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను మహేశ్ బాబుతో చేయనున్నాడు. హారిక అండ్ హాసిని వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అనుకున్న దానికంటే ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. అందుకు కారణం ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు కావడమేనని అంటున్నారు.

ఇక ఈ కథ చారిత్రక నేపథ్యంలో సాగుతుందనీ, మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడనేది తాజా సమాచారం. ఈ రెండు పాత్రలను డిజైన్ చేయడానికి త్రివిక్రమ్ ఎక్కువ సమయాన్ని తీసుకోవడం కూడా ఆలస్యానికి మరో కారణమని చెబుతున్నారు. ఇంతవరకూ మహేశ్ చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు అని అంటున్నారు. 
 
తెరపై ఈ కథ నడిచే తీరు కూడా డిఫరెంట్ గా ఉంటుందనీ, అటు గతం .. ఇటు వర్తమానం కలిసి నడిచేలా త్రివిక్రమ్ చేసిన స్క్రీన్ ప్లే గొప్పగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి ఒక కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. మరో కథానాయికగా ఎవరికి ఛాన్స్ తగులుతుందనేది చూడాలి.

More Telugu News