సికింద్రాబాద్ లో ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లపై రెండేళ్లుగా అత్యాచారం
- ఇద్దరు యువకులపై పోక్సో కేసు
- నిందితులు నవాజ్, ఇంతియాజ్ గా గుర్తింపు
- ఫేస్ బుక్ ద్వారా పరిచయమై అఘాయిత్యం
సికింద్రాబాద్ కు చెందిన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లపై ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఫేస్ బుక్ ద్వారా పరిచయమై ప్రేమ పేరిట నమ్మించి వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రెండేళ్లుగా వారిపై అత్యాచారం చేస్తున్నారు. బాలికల తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులు నవాజ్ (21), ఇంతియాజ్ (21)లపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను అంబర్ పేటకు చెందిన వారుగా గుర్తించారు.