కేవలం మాటలేనా?.. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో మోదీ భేటీపై కేటీఆర్ ట్వీట్!
- మోదీతో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల భేటీ
- ఈ భేటీని ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్
- హైదరాబాద్కు ఏం చేశారంటూ నిలదీత
- తెలంగాణకు మాటలు, గుజరాత్కు మూటలంటూ సెటైర్
హైదరాబాద్ వరద నివారణ నిధుల విషయంలో ఏమైనా పురోగతి ఉందా? మూసీ ఆధునికీకరణ పనులకు సంబంధించి ఏమైనా నిధులు ఇస్తారా? హైదరాబాద్ మెట్రోకు ఏమైనా ఆర్థిక దన్ను ఇస్తున్నారా? ఐటీఐఆర్పై ఏమైనా కొత్త మాట చెబుతారా?...ఇలా వరుస ప్రశ్నలను సంధించిన కేటీఆర్... తెలంగాణకు పైసా నిధులివ్వని ప్రధాని మోదీ కార్పొరేటర్లతో మాత్రం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణకు మాటలు మాత్రమే చెబుతూ మూటలన్నీ గుజరాత్కు ఇస్తున్నారు అంటూ మోదీపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.