TPCC President: అమెరికాలో రేవంత్ రెడ్డి... వేల ఎక‌రాల వ్య‌వ‌సాయ క్షేత్రం ప‌రిశీల‌న‌

  • తెలంగాణ కాంగ్రెస్ ఎన్నారై శాఖ ఆహ్వానం మేర‌కు అమెరికాకు రేవంత్‌
  • శుక్ర‌వారం డ‌ల్లాస్‌లో ప‌ర్య‌ట‌న‌
  • 6 వేల ఎక‌రాల్లో సాగు చేస్తున్న మైక్ ఫ‌ల్లాన్‌తో భేటీ
  • సాగు పద్ధతుల‌పై ఫ‌ల్లాన్‌తో రేవంత్ చ‌ర్చ‌
  • మంచి అనుభ‌వం అంటూ ట్వీట్ చేసిన టీపీసీసీ చీఫ్‌
revanth reddy visited a huge farm land in dallas

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) అధ్య‌క్షుడు, మ‌ల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్ర‌స్తుతం అమెరికా పర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నారై శాఖ ఆహ్వానం మేర‌కు రేవంత్ అమెరికా వెళ్లారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి నేత‌ల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం డ‌ల్లాస్ వెళ్లిన రేవంత్ రెడ్డి...అక్క‌డ ఉన్న ఓ భారీ వ్య‌వ‌సాయ క్షేత్రాన్ని ప‌రిశీలించారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

డ‌ల్లాస్‌కు చెందిన మైక్ ఫ‌ల్లాన్ ఏకంగా 6 వేల ఎక‌రాల్లో వ్య‌వ‌సాయం చేస్తున్నార‌ట‌. ఈ విషయం తెలుసుకున్న రేవంత్ ఫ‌ల్లాన్‌తో ఆయ‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలోనే భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఫ‌ల్లాన్ అనుస‌రిస్తున్న వ్య‌వసాయ పద్ధతులను ప‌రిశీలించారు. అక్క‌డి వ్య‌వ‌సాయ విధానాలు, సాగుకు అయ్యే ఖర్చు, పంట‌ల బీమా, సాగుకు అమెరికా ప్ర‌భుత్వం ఇస్తున్న మ‌ద్ద‌తు, సాగు రంగాన్ని ఆ దేశ ప్ర‌భుత్వం కాపాడుకుంటున్న తీరును ఫ‌ల్లాన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇది ఓ మంచి అనుభవం అంటూ రేవంత్ వెల్ల‌డించారు.

More Telugu News