Mahesh Babu: 100 కోట్ల షేర్ మార్క్ దిశగా 'సర్కారివారి పాట'

  • ఈ నెల 12వ తేదీన విడుదలైన 'సర్కారువారి పాట'
  • నిన్న రాత్రి కర్నూల్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించిన టీమ్
  • 95 కోట్ల షేర్ మార్కును అందుకున్నట్టుగా వేదికపై నుంచి చేసిన ప్రకటన
  • ఫస్టు టైమ్ స్టేజ్ పై డాన్స్  చేసిన మహేశ్ బాబు   
Sarkaru Vaari Paata movie update

మహేశ్ బాబు .. కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ 'సర్కారువారి పాట' సినిమాను రూపొందించాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిన్న రాత్రి 'కర్నూల్' లో నిర్వహించారు. దర్శక నిర్మాతలతో పాటు మహేశ్ బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
ఎప్పుడూ లేని విధంగా మహేశ్ బాబు తనంతట తానుగా స్టేజ్ పైకి వచ్చి, 'మ మ మహేశా' పాటకి స్టెప్పులు వేయడం విశేషం. హఠాత్తుగా ఆయన అలా చేయడంతో తాను ఒక్కసారిగా షాక్ అయ్యానని తమన్ అనడంతో మహేశ్ బాబు నవ్వేశారు. ఈ సినిమాలో తనకి బాగా నచ్చింది లవ్ ట్రాక్ అని మహేశ్ చెప్పడం మరో విశేషం. 

ఇక ఈ సినిమా ఫ్లాప్ అనీ .. వసూళ్లు డ్రాప్ అయ్యాయనే ఒక ప్రచారం జరుగుతోంది. వాటికి తెరదింపాలనే ఉద్దేశంతో, 'ఇప్పుడే అందిన వార్త .. ఈ సినిమా మరో రెండు కోట్లను వసూలు చేసింది .. దీంతో 95 కోట్ల షేర్ రాబట్టినట్టు అయింది' అని స్టేజ్ పైన యాంకర్ శ్యామలతో చెప్పించారు. ఆ సమయంలో చప్పట్లు కొడుతూ మహేశ్ బాబు హర్షాన్ని వ్యక్తం చేశాడు. నేడో .. రేపో ఈ సినిమా 100 కోట్ల షేర్ మార్కును అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News