ఉత్తర కొరియాలో కరోనా విస్ఫోటం.. ఎంటరైన 3 రోజుల్లోనే 8,20,620 కేసులు
- ఆసుపత్రుల్లో 3,24,550 మందికి చికిత్స
- ఇవాళ మరో 15 మంది మహమ్మారికి బలి
- 42కు పెరిగిన కరోనా మరణాల సంఖ్య
కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండడంతో దేశమంతా లాక్ డౌన్ విధించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, నగరాలు, కౌంటీల్లో లాక్ డౌన్ కొనసాగుతోందని ఆ దేశ అధికారిక పత్రిక కేసీఎన్ఏ వెల్లడించింది. పని ప్రాంతాలు, ఉత్పత్తి యూనిట్లు, నివాస సముదాయాలన్నింటినీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా మూసేసినట్టు పేర్కొంది.
కాగా, దేశంలోకి ఒమిక్రాన్ ఎంటరైందని ఉత్తరకొరియా గత గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసులు పెరిగిపోతుండడంతో నిన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మహమ్మారితో దేశం అల్లాడుతోందని ఆయన అన్నారు.