Andhra Pradesh: రాయలసీమ జిల్లాల్లో గ‌వ‌ర్న‌ర్‌... తిరుమ‌ల వెంక‌న్న సేవ‌లో బిశ్వ‌భూష‌ణ్‌ హ‌రిచంద‌న్

  • అనంత జేఎన్టీయూ స్నాత‌కోత్సవానికి హాజ‌రు
  • ఆ త‌ర్వాత శ్రీ బాలాజీ జిల్లాకు ప‌య‌నం
  • రేణిగుంట‌లో గ‌వ‌ర్నర్‌కు క‌లెక్ట‌ర్ స్వాగ‌తం 
  • స‌తీస‌మేతంగా వెంక‌న్న సేవ‌లో గ‌వ‌ర్న‌ర్‌
ap governor visits tirumala

ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఈ రోజు రాయ‌ల‌సీమ జిల్లాల్లో ప‌ర్య‌టించారు. విజ‌య‌వాడ నుంచి బ‌య‌లుదేరి అనంతపురం చేరుకున్న ఆయ‌న‌... అక్క‌డ జేఎన్టీయూ స్నాత‌కోత్స‌వంలో పాలుపంచుకున్నారు. ఆ త‌ర్వాత అటు నుంచి అటే ఆయ‌న శ్రీ బాలాజీ జిల్లాకు వెళ్లారు. తిరుప‌తి స‌మీపంలోని రేణిగుంట విమానాశ్ర‌యంలో ఆయ‌న‌కు జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి స్వాగ‌తం ప‌లికారు.

ఆ త‌ర్వాత తిరుప‌తిలోని ప‌ద్మావ‌తి అతిథి గృహానికి చేరుకున్న గ‌వ‌ర్న‌ర్‌కు టీటీడీ ఇన్‌ఛార్జ్‌ ఈవో ధ‌ర్మారెడ్డి, వేద పండితులు స్వాగ‌తం ప‌లికారు. కాసేప‌టి క్రితం తిరుమ‌ల వెళ్లిన ఆయ‌న స‌తీస‌మేతంగా క‌లియుగ దైవం శ్రీవేంకటేశ్వ‌ర స్వామి సేవ‌లో పాల్గొన్నారు.

More Telugu News