Janasena: నాగ‌బాబుతో చిత్తూరు జ‌న‌సైనికులు... అభివృద్ధి లేక‌పోవ‌డంపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌

  • నాగ‌బాబుతో భేటీ కోసం హైద‌రాబాద్‌కు చిత్తూరు జ‌న‌సైనికులు
  • చిత్తూరు ప‌రిస‌రాల్లో ప‌రిస్థితుల‌పై వివ‌రాల ఆంద‌జేత‌
  • జ‌న‌సైనికుల ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ను ఆస‌క్తిగా చూసిన నాగ‌బాబు
chittoor janasainiks met nagababu

చిత్తూరు అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గానికి చెందిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కొంద‌రు శనివారం పార్టీ రాజ‌కీయ వ్య‌వహారాల క‌మిటీ (పీఏసీ) స‌భ్యుడు, ప్రముఖ సినీ న‌టుడు నాగబాబును హైద‌రాబాద్‌లో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు త‌మ నియోజ‌క‌వర్గ ప‌రిధిలో.. ప్ర‌త్యేకించి చిత్తూరు న‌గ‌ర ప‌రిస‌రాల్లో అభివృద్ధి లేకుండా పోయిన వైనంపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ను నాగ‌బాబు ముందు పెట్టారు.

ప్ర‌ణాళిక లేక‌పోవ‌డం, సరైనా పాల‌న లేక‌పోవ‌డం కార‌ణంగా చిత్తూరు ప‌రిస‌రాల్లో ప‌రిశ్ర‌లు, రోడ్లు, ఇత‌ర మౌలిక స‌దుపాయాలు ఏ రీతిన దెబ్బతిన్నాయ‌న్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా జ‌న సైనికులు నాగ‌బాబుకు వివ‌రించారు. జ‌న‌సైనికులు ప్ర‌ద‌ర్శించిన ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ను నాగ‌బాబు ఆస‌క్తిగా ప‌రిశీలించారు. ఈ వివ‌రాల‌ను నాగ‌బాబు ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

More Telugu News