తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాశయాల నిర్వహణ కమిటీ ఏర్పాటు
- ఆరుగురు సభ్యులతో కమిటీ
- కమిటీ కన్వీనర్గా కేఆర్ఎంబీ సభ్యుడు రవికుమార్ పిళ్లై
- సభ్యులుగా కేఆర్ఎంబీ సభ్యుడు మౌతాంగ్, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు
- ఇరు రాష్ట్రాల జెన్కో అధికారులకూ చోటు
ఇక కమిటీలో మిగిలిన సభ్యులుగా కేఆర్ఎంబీ సభ్యుడు మౌతాంగ్, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు, రెండు రాష్ట్రాల జెన్కోలకు చెందిన వెంకటరాజం, సృజయ్ కుమార్లు నియమితులయ్యారు. ప్రధానంగా మూడు అంశాల ఆధారంగా ఈ కమిటీ ఏర్పాటైంది. శ్రీశైలం, సాగర్లో విద్యుదుత్పత్తి కోసం 15 రోజుల్లోగా విధి విధానాలు ఖరారు చేయాలని, నెలలోగా శ్రీశైలం, సాగర్ జలాశయాల రూల్ కర్వ్ ముసాయిదా పరిశీలన జరగాలని, 75 శాతం లభ్యతకు పైబడి వరద జలాల వినియోగానికి విధి విధానాలు రూపొందించాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ కమిటీ ఏర్పాటైంది.