YS Jagan: బ‌ల‌భ‌ద్ర‌పురంలో బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్‌...రేపు ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌

  • రేపు తూర్పు గోదావ‌రి జిల్లా టూర్‌కు జ‌గ‌న్‌
  • బిక్కవోలు మండ‌లం బ‌ల‌భ‌ద్ర‌పురంలో యూనిట్ 
  • హాజ‌రు కానున్న బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగ‌ళం బిర్లా
jagan will tour in east godavari district tomorrow

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం నాడు తూర్పు గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. జిల్లాలోని బిక్క‌వోలు మండ‌లం బ‌ల‌భ‌ద్ర‌పురంలో బిర్లా గ్రూప్ కొత్త‌గా కాస్టిక్ సోడా యూనిట్ ఏర్పాటు చేయ‌నుంది. ఈ యూనిట్‌ను జ‌గ‌న్ లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగ‌ళం బిర్లా కూడా హాజ‌రు కానున్నారు.

More Telugu News