Konatala Ramakrishna: రైల్వే కోర్టుకు మాజీ మంత్రి కొణ‌తాల హాజ‌రు.. కేసు ఏమిటంటే..!

  • 2018-19 మ‌ధ్య ఢిల్లీ యాత్ర చేప‌ట్టిన మాజీ మంత్రి
  • ఈ సంద‌ర్భంగానే కొణ‌తాల‌పై ఆర్పీఎఫ్ కేసు 
  • ఈ కేసు విచార‌ణ కోస‌మే విశాఖ రైల్వే కోర్టుకు కొణ‌తాల‌
  • కేసు విచార‌ణ‌ను వ‌చ్చే 4కు వాయిదా వేసిన కోర్టు
ex minister konatala ramakrishna attends vizag railway court

ఉమ్మ‌డి రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా ప‌నిచేసిన కొణ‌తాల రామ‌కృష్ణ సోమ‌వారం నాడు విశాఖ రైల్వే కోర్టుకు హాజ‌ర‌య్యారు. 2018-19 మ‌ధ్య చ‌లో ఢిల్లీ యాత్ర పేరిట కొణ‌తాల ఓ ఉద్య‌మాన్ని న‌డిపిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కొణ‌తాల‌పై రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ (ఆర్పీఎఫ్‌) పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసు విచార‌ణ విశాఖ‌లోని రైల్వే కోర్టులో సాగుతోంది. ఈ కేసు విచార‌ణ కోసం సోమ‌వారం నాడు మాజీ మంత్రి కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను కోర్టు వ‌చ్చే నెల 4కు వాయిదా వేయ‌డంతో కొణ‌తాల కోర్టు నుంచి వెళ్లిపోయారు.

More Telugu News