Pawan Kalyan: రేపు అనంతపురం జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

  • ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతులు
  • బాధిత కుటుంబాలను పరామర్శించనున్న పవన్
  • ఆర్థికసాయం అందించనున్నవైనం
Pawan Kalyan will visit Ananatapur district tomorrow

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మేరకు తలపెట్టిన రైతు భరోసా యాత్రను రేపు ప్రారంభించనున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు పవన్ కల్యాణ్ పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ్నించి జిల్లాలో ఆయన పర్యటన షురూ కానుంది.

పర్యటన షెడ్యూల్ ఇదిగో...

  • మండల కేంద్రమైన కొత్తచెరువు గ్రామానికి చేరిక. అక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రౌతు కుటుంబానికి ఆర్థికసాయం అందజేత.
  • కొత్తచెరువు గ్రామం నుంచి 10.30 గంటలకు బయల్దేరి ధర్మవరంలో మరో బాధిత రైతు కుటుంబానికి పరామర్శ. ఆర్థికసాయం అందజేత.
  • 11.20 గంటలకు ధర్మవరం నుంచి ధర్మవరం రూరల్ లోని గొట్లూరు గ్రామానికి పయనం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఆర్థికసాయం అందజేత.
  • అక్కడి నుంచి 12.10 గంటలకు బయల్దేరి అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామానికి రాక. 20 రోజుల కింద ఆత్మహత్యకు పాల్పడిన యువ రైతు కుటుంబానికి ఓదార్పు.. ఆర్థికసాయం.
  • చివరగా అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామం చేరిక. ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు కౌలురైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేత.
  • అదే గ్రామంలో రచ్చబండ గ్రామసభ కార్యక్రమం నిర్వహణ.
  • మరికొందరు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేత.
  • సభ అనంతరం హైదరాబాద్ కు పయనం.

More Telugu News