Corona Virus: ముంబైలో ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్‌... హై అలర్ట్ ప్ర‌క‌టించిన కేంద్రం

  • యూకేలో తొలిసారి వెలుగు చూసిన ఎక్స్ఈ వేరియంట్‌
  • తాజాగా భార‌త్‌లోనూ తొలి కేసు న‌మోదు
  • అధ్య‌య‌నం జ‌రుగుతోంద‌న్న కేంద్రం
omicron xe variant first case reportedin mumbai

ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనాలో కొత్త వేరియంట్ భార‌త్‌లో ప్ర‌వేశించింది. ఒమిక్రాన్ ఎక్స్ఈగా పిలుస్తున్న ఈ వేరియంట్‌కు సంబంధించిన తొలి కేసు మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో బుధ‌వారం నాడు వెలుగు చూసింది. బ్రిట‌న్‌లో జ‌న‌వ‌రి 19న ఈ వేరియంట్ తొలి కేసు న‌మోదు కాగా.. తాజాగా భార‌త్‌లోనూ బుధ‌వారం ఈ వేరియంట్‌కు చెందిన తొలి కేసు న‌మోదైంది. 

క‌రోనా కొత్త వేరియంట్ కేసు న‌మోదైన నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం దేశంలో హై అలర్ట్ ప్ర‌క‌టించింది. కొత్త  వేరియంట్‌పై అధ్య‌య‌నం జ‌రుగుతోంద‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఈ వేరియంట్‌కు సంబంధించి పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌క‌టించింది.

More Telugu News