Vijayashanti: ఇంత‌కంటే దారుణం ఎక్క‌డైనా ఉంటుందా?: కేసీఆర్‌పై విజ‌య‌శాంతి విమ‌ర్శ‌లు

  • ఓయూలో విద్యార్థుల ఆందోళ‌న‌
  • వ‌ర్సిటీలో వ‌సతులు లేవు
  • అన్నంలో పురుగులొస్తున్నాయి
  • చర్యలు తీసుకోవడం లేదన్న విజ‌య‌శాంతి
vijay shanti slams kcr

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ''ఉస్మానియా వ‌ర్సిటీలో వ‌సతుల కోసం స్టూడెంట్లు రోడ్డెక్కే ప‌రిస్థితిని కేసీఆర్ స‌ర్కార్ తీసుకొచ్చింది. అన్నంలో పురుగులొస్తున్నాయని, పెరుగు, కూరలు సరిగ్గా ఉంటలేవని, బాత్ రూమ్‌లకు డోర్లు, లాక్‌లు లేవని ఓయూ క్యాంపస్ ఆడబిడ్డలు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 

అయినా అధికారులు కానీ, ప్ర‌భుత్వం కానీ ప‌ట్టించుకోవడం లేదు. పైపెచ్చు... ప్రశ్నించే విద్యార్థినులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నరు. సోమవారం కూడా వందలాది మంది విద్యార్థినులు పురుగుల అన్నం, కూరలతో రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్య‌మాలు చేసిన విద్యార్థులు... వ‌స‌తుల కోసం రోడ్డెక్కి నిర‌స‌న చేయాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. ఓయూ లేడీస్ హాస్టల్‌లో ప్రస్తుతం సుమారు 5 వేల మంది అమ్మాయిలు చదువుతున్నరు. వారి కోసం నాలుగు మెస్‌లు నడుపుతున్నరు. 

మెనూ ప్రకారం రోజూ బ్రేక్ ఫాస్ట్‌లో కిచిడి, చపాతి, ఊతప్పం, పూరీ, దోశ, ఇడ్లీ పెట్టాల్సి ఉన్నా... కేవలం ఇడ్లీ, పూరీలతోనే సరిపెడుతున్నరు. వాటి కోసం కూడా గంటల తరబడి క్యూ కట్టాల్సి వస్తోంది. గతంలో వారంలో రెండు సార్లు... నాన్ వెజ్ పెట్టేవారు. ప్రతి బుధవారం 150 గ్రాముల మటన్, ప్రతి ఆదివారం 250 గ్రాముల చికెన్ ఇచ్చేవారు. కొంతకాలంగా మటన్ ఆపేసిన అధికారులు... ప్రస్తుతం చికెన్ మాత్రం ఇస్తున్నరు. అది కూడా 100 గ్రాములకు మించడం లేదని విద్యార్థినులు చెబుతున్నరు.

ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నరు. క‌నీసం తాగునీరు కూడా సరిగ్గా స‌ప్లై చేయ‌డం లేదు. కిటికీలు సరిగ్గా లేక గదుల్లోకి తరచూ పాములు వస్తున్నాయని అధికారులకు చెబుతున్నా... ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇంత‌కంటే దారుణం ఎక్క‌డైనా ఉంటుందా? దొర‌గారు ఫామ్ హౌస్‌లో ప‌డుకొని పాల‌న చేస్తే.. మ‌న ఆడ‌బిడ్డ‌లు ప‌డుతున్న క‌ష్టం ఏం తెలుస్తుంది? ఆడ‌బిడ్డ‌ల కష్టాలు ప‌ట్టని ఈ సీఎం ఉంటే ఎంత? లేకుంటే ఎంత‌? ఇప్ప‌టికైనా హాస్ట‌ల్స్‌లో సౌల‌తులు క‌ల్పించాలి. 

తెలంగాణ ఉద్య‌మంతో దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించిన ఘనత ఉస్మానియా సోంతం. కేసీఆర్.. విద్యార్థుల్ని విస్మరిస్తే వారు నిన్ను కూడా కాల‌గర్భంలో క‌లిపేయడం ఖాయం. ఎన్నోసార్లు రుజువైన సత్యమిది... గుర్తుంచుకో'' అని విజ‌య‌శాంతి ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News