తెలంగాణలో ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు సెలవులు
- 7 నుంచి 1-9 తరగతుల విద్యార్థులకు పరీక్షలు
- 23లోగా వెల్లడి కానున్న ఫలితాలు
- 24 నుంచి సెలవులు ప్రారంభం
ఈ ప్రకటన ప్రకారం ఏప్రిల్ 7 నుంచే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షా ఫలితాలను 23లోగా విడుదల చేయనున్నారు. ఆ మరునాటి నుంచే అంటే.. ఏప్రిల్ 24 నుంచే వేసవి సెలవులు మొదలు కానున్నాయి. భారీగా పెరిగిన ఎండ వేడిమి నేపథ్యంలో ఇప్పటికే మొదలైన ఒంటిపూట బడులను కూడా గురువారం నుంచి ఉదయం 11.30 గంటలకే ముగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే వేసవి సెలవులపైనా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.