ఫ్యాను గుర్తుకు ఓటేస్తే.. ఫ్యాన్లు తిరగని పరిస్థితి: జ‌న‌సేన‌

janasena statement on current charges hikein ap
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచుతూ జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న తాజా నిర్ణ‌యంపై జ‌న‌సేన సెటైరిక్‌గా స్పందించింది. 2019 ఎన్నిక‌ల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన కార‌ణంగా ఇప్పుడు ఇళ్ల‌ల్లో ఫ్యాన్ తిరగ‌ని ప‌రిస్థితి దాపురించిందంటూ ఆ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌న‌సేన ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. 

వైసీపీ ప్ర‌భుత్వం విద్యుత్ చార్జీల‌ను భారీగా పెంచి ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో జ‌న‌సేన ఆరోపించింది. విద్యుత్ చార్జీల పెంపును వ్య‌తిరేకిస్తున్న‌ట్లు చెప్పిన జ‌న‌సేన‌.. ప్ర‌జ‌ల‌పై భారం మోపాల‌ని చూస్తే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించింది. బాధ్య‌త క‌లిగిన విప‌క్షంగా ప్ర‌జ‌ల ప‌క్షాన రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు బుధ‌వారం నాడు రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో జ‌న‌సేన పీఏసీ చైర్మ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆ పార్టీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పొందుప‌ర‌చింది.
Go Back to Shorts
Janasena
current charges
Nadendla Manohar

More Telugu News