ఏప్రిల్ 1 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి.. 20న టికెట్ల విడుదల
- కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం భక్తులకు అనుమతి రద్దు
- కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి అనుమతి
- మూడు రోజులపాటు టికెట్లు అందుబాటులో
- ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టికెట్ల కేటాయింపు
20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు సేవలకు సంబంధించిన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. టికెట్లు దక్కించుకున్న వారి వివరాలను 22న ఉదయం 10 గంటల తర్వాత వెబ్సైట్లో పెడతారు. ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టికెట్లను కేటాయిస్తారు. అలాగే, శ్రీవారి గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకున్న భక్తులకు ఆలయ ఆవరణలోనే తీర్థం, శఠారి అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో గతంలో దీనిని రద్దు చేశారు.