YSRCP: ఢిల్లీలో వైఎస్సార్ రీసెర్చి సెంట‌ర్‌.. ప్రారంభించిన విజయసాయిరెడ్డి!

  • పార్లీ ఎంపీల స‌మ‌క్షంలో రిబ్బ‌న్ క‌టింగ్‌
  • పార్టీ ఎంపీల‌కు దిశానిర్దేశం కోస‌మే సెంట‌ర్‌
  • రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై ఎంపీల‌కు అవ‌గాహ‌నకు కృషి
  • సెంట‌ర్ ప్రారంభోత్స‌వంలో సాయిరెడ్డి
ysrcpp leader vijay sai reddy opens ysr reaserch center in delhi

వైఎస్సార్సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌, ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి మంగ‌ళ‌వారం నాడు ఓ కీల‌క అడుగు వేశారు. ఢిల్లీలో వైఎస్సార్ రీసెర్చి సెంట‌ర్ పేరిట ఓ కొత్త కార్యాల‌యాన్ని ఆయ‌న ప్రారంభించారు. పార్టీకి చెందిన లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులంతా రాగా..వారి సమ‌క్షంలోనే సాయిరెడ్డి ఈ సెంట‌ర్‌ను ప్రారంభించారు. 

ఈ సంద‌ర్భంగా ఈ సెంట‌ర్ ముఖ్యోద్దేశం ఏమిట‌న్న విష‌యాన్ని కూడా సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. పార్ల‌మెంటు స‌మావేశాల్లో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన ఏఏ అంశాల‌ను లేవ‌నెత్తాల‌న్న విష‌యంపై పార్టీ ఎంపీల‌కు ఈ సెంట‌ర్ స‌హాయ ప‌డుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఆయా సంద‌ర్భాల‌ను బ‌ట్టి ఎప్పుడు ఏ స‌మ‌స్య‌ను లెవ‌నెత్తితే ఉపయోగం ఉంటుంద‌న్న విష‌యంపైనా పార్టీ ఎంపీల‌కు ఈ సెంట‌ర్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు.

More Telugu News