ఈ నెల 24 నుంచి బేగంపేటలో విమాన ప్రదర్శన.. సందర్శనకు టికెట్ ధర ఎక్కువే!
- నాలుగేళ్ల తర్వాత తొలిసారి విమాన ప్రదర్శన
- ఈ నెల 22 నుంచి నాలుగు రోజులపాటు నిర్వహణ
- చివరి రోజు సాధారణ సందర్శకులకు అనుమతి
- ఒక్కొక్కరికి రూ. 500 టికెట్
ఈ భారీ విమాన ప్రదర్శనను చూడాలనుకునేవారు వింగ్స్ ఇండియా వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. తొలి మూడు రోజులు వ్యాపారవేత్తలను అనుమతిస్తారు. ప్రదర్శన చివరి రోజైన 27న సాధారణ సందర్శకులను అనుమతిస్తారు. అయితే, టికెట్ ధరను మాత్రం ప్రజలు భయపడేలా నిర్ణయించారు. ఒక్కొక్కరికి రూ. 500గా నిర్ణయించారు. చిన్నారులను ఈ ప్రదర్శనకు తీసుకెళ్లి కాస్తంత విజ్ఞానాన్ని పెంచాలనుకునే తల్లిదండ్రులకు ఈ ధర శరాఘాతంలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.