YS Jagan: జ‌గ‌న్‌తో డాక్టర్ నోరి ద‌త్తాత్రేయుడి భేటీ.. ఏపీలో 3 కేన్స‌ర్ ఆసుప‌త్రుల నిర్మాణం

  •  తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో భేటీ 
  • 3 కేన్స‌ర్ ఆసుప‌త్రుల డీపీఆర్‌ల అంద‌జేత‌
  • తిరుప‌తి, విశాఖ‌, గుంటూరు- విజ‌య‌వాడ‌ల మ‌ధ్య ఆసుప‌త్రులు
nori dattatreyudu meets ap cm jagan

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీలోని మూడు ప్ర‌ధాన న‌గ‌రాల్లో 3 కేన్స‌ర్ ఆసుప‌త్రుల‌ను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసేశారు. ఈ మేర‌కు సీఎం విజ్ఞ‌ప్తి మేర‌కు కేన్స‌ర్ వైద్య నిపుణుడు డాక్ట‌ర్ నోరి ద‌త్తాత్రేయుడు శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో జ‌గ‌న్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఇదివ‌ర‌కే మూడు న‌గ‌రాల్లో మూడు కేన్స‌ర్ ఆసుప‌త్రుల నిర్మాణానికి సంబంధించి ఇచ్చిన ఆదేశాల మేర‌కు నోరి ద‌త్తాత్రేయుడు డీపీఆర్‌ల‌ను సీఎంకు అంద‌జేశారు. 

ఏపీ వాసులు కేన్స‌ర్ వైద్య చికిత్స‌ల కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా రాష్ట్రంలోనే చికిత్స‌లు తీసుకునేలా ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు తెలిపిన జ‌గ‌న్‌.. అందుకు స‌హ‌క‌రించాల‌ని ఇదివ‌ర‌కే నోరిని కోరారు. ఈ విష‌యంలో ఏపీకి స‌హ‌క‌రించేందుకు సిద్ధ‌మేన‌ని తెలిపిన నోరి.. తాజాగా ఆయా ఆసుప‌త్రుల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌ల‌ను సీఎంకు అంద‌జేశారు.

ఈ డీపీఆర్‌ల ప్ర‌కారం తిరుప‌తి, గుంటూరు- విజ‌య‌వాడ‌ల మ‌ధ్య‌, విశాఖప‌ట్నంలో 3 అత్యాధునిక కేన్స‌ర్ ఆసుప‌త్రుల‌ను ఏపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నుంది. తిరుప‌తిలో ఏర్పాటు కానున్న ఆసుప‌త్రిలో ప్ర‌త్యేంగా చిన్న పిల్ల‌ల‌కు కేన్స‌ర్ వైద్యం అందించే ఏర్పాట్లు చేయ‌నున్నారు. ఈ ఆసుప‌త్రుల నిర్మాణం పూర్తి అయితే ఏపీ వాసుల‌కు వారి రాష్ట్రంలోనేయ కేన్స‌ర్ చికిత్స‌లు అంద‌నున్నాయి.

  • Loading...

More Telugu News