BrahMos: సముద్రంపై భారత్ ఆధిపత్యం.. ‘బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతం.. వీడియో ఇదిగో

Navy Test Fires Advanced BrahMos Version
షార్ట్స్‌లో చూడండి
రక్షణ రంగంలో రోజురోజుకు బలోపేతం అవుతున్న భారత్ అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక క్షిపణి వచ్చిచేరింది. సముద్రతలంపై ఆధిపత్యం సాధించే ఉద్దేశంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘బ్రహ్మోస్’ సుదీర్ఘ శ్రేణి క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఈ మేరకు భారత నావికాదళం ప్రకటించింది. 

యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి పూర్తి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు తెలిపింది. ఇప్పటి వరకు వీటికి భూ, గగనతల పరీక్షలు నిర్వహించగా, తొలిసారి యుద్ధనౌక నుంచి ప్రయోగించారు. ధ్వని వేగాన్ని మించి ప్రయాణించగల ఈ క్షిపణులు శత్రు దేశ స్థావరాలను తుత్తునియలు చేయగలవు. భారత్-రష్యా సంయుక్త సహకారంతో అభివృద్ధి చేస్తున్న ‘బ్రహ్మోస్’ ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధాల్లో ఒకటి కావడం విశేషం.
Go Back to Shorts
BrahMos
Indian Navy
Test Fire

More Telugu News