Andhra Pradesh: ఏపీలో తాజాగా 86 కరోనా పాజిటివ్ కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!

AP Corona updates
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 14,788 కరోనా పరీక్షలు నిర్వహించగా, 86 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 17, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, ప్రకాశం, విశాఖ జిల్లాలలో 12 కేసుల చొప్పున నమోదయ్యాయి. అదే సమయంలో 288 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. వరుసగా మరో రోజు మరణాలేవీ సంభవించలేదు. 

ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,262 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,02,192 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,341కి తగ్గింది. ఇప్పటిదాకా కరోనాతో 14,729 మంది మరణించారు.
.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Updates
Today Cases

More Telugu News