ఏపీలో మరో 2,690 కరోనా పాజిటివ్ కేసులు

AP Corona Daily Bulletin
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా వ్యాప్తి కనిష్ట స్థాయికి దిగి వస్తోంది. గడచిన 24 గంటల్లో 28,598 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 2,690 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 518 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 354, కృష్ణా జిల్లాలో 352, పశ్చిమ గోదావరి జిల్లాలో 298 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 11,855 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మరణించారు. తాజా మరణాలతో కరోనా మృతుల సంఖ్య 14,664కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,03,455 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,19,219 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 69,572 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
AP
Corona Virus
Daily Bulletin
Today Cases

More Telugu News