Kanipakam: కాణిపాకం ఆలయంలో దారుణం.. పాత రథచక్రాలకు నిప్పు పెట్టిన దుండగులు!

  • గోశాల పక్కన నిల్వ ఉంచిన రథ చక్రాలు
  • నిప్పు పెట్టడంతో బూడిదగా మారిన వైనం  
  • తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భక్తులు
Chariot wheels burnt by unknown in Kanipakam

ఏపీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎంతో ప్రసిద్ధిగాంచిన చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో కలకలం రేగింది. వరసిద్ధి వినాయకుడి ఆలయంలో పాత రథ చక్రాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ రథ చక్రాలను గోశాల పక్కన నిల్వ ఉంచారు.

ఈ ఘటనలో రథ చక్రాలు పూర్తిగా కాలిపోయి, బూడిదగా మారాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News