EC: ఐదు రాష్ట్రాల ఎన్నికలు: ర్యాలీలు, రోడ్ షోలపై ఈ నెల 31 వరకు నిషేధం పొడిగింపు

  • ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు
  • ఏడు దశల్లో పోలింగ్
  • ఈ నెల 31 వరకు ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం
  • మొదటి, రెండో దశ ఎన్నికలు జరిగే ప్రాంతాలకు సడలింపు
EC extends ban on rallies and road shows in poll bound five states

ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు మొత్తం 7 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల సంఘం ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. తాజాగా ఆ నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది.

అయితే, తొలిదశలో ఎన్నికలు జరుపుకునే ప్రాంతాల్లో ఈ నెల 28 తర్వాత ఆయా ప్రాంతాల్లో బహిరంగ సభలకు అనుమతి ఇచ్చింది. రెండో దశ ఎన్నికలు జరుపుకునే ప్రాంతాల్లో ఫిబ్రవరి 1 నుంచి సభలు నిర్వహించుకోవచ్చని ఈసీ తెలిపింది. ఇంటింటి ప్రచారానికి ఇప్పటివరకు గరిష్ఠంగా ఐదుగురికి మాత్రమే అనుమతి ఉండగా, ఇప్పుడా సంఖ్యను 10కి పెంచింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వీడియో ప్రచార రథాలను రంగంలోకి దింపుకోవచ్చని పేర్కొంది.

More Telugu News