తమిళనాడులో కరోనా ఉద్ధృతి... ఈ నెల 31 వరకు విద్యాసంస్థల మూసివేత
- తమిళనాడులో భారీగా కరోనా కేసులు
- నిన్న ఒక్కరోజులో 23 వేలకు పైగా కొత్త కేసులు
- ఇప్పటికే 1 నుంచి 9వ తరగతుల వారికి సెలవులు
- తాజాగా 10, 11, 12వ తరగతి విద్యార్థులకు సెలవులు
విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తమిళనాడు విద్యాశాఖ పేర్కొంది. పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వివరించింది.