Telangana: తెలంగాణలో మరో 177 కరోనా కేసులు... తాజా బులెటిన్ వివరాలు ఇవిగో!

  • గత 24 గంటల్లో 38,219 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 93 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,596 మందికి చికిత్స
Telangana corona bulletin

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,219 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 177 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 93 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 16 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 190 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,80,251 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,72,637 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,596 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,018కి పెరిగింది.

  • Loading...

More Telugu News