Sensex: 887 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

  • 264 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
  • అన్ని సూచీలు లాభాల్లోనే ముగిసిన వైనం
  • దాదాపు 4 శాతం వరకు పెరిగిన టాటా స్టీల్ షేర్ వాల్యూ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తక్కువగా ఉంటుందనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 887 పాయింట్లు లాభపడి 57,634కి పెరిగింది. నిఫ్టీ 264 పాయింట్లు పుంజుకుని 17,177 వద్ద స్థిరపడింది.

ఇక ఈరోజు అన్ని సూచీలు లాభాల్లోనే ముగిశాయి. మెటల్ సూచీ 3 శాతానికి పైగా లాభపడగా... రియాల్టీ, బ్యాంకెక్స్ సూచీలు రెండు శాతానికి పైగా లాభపడ్డాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (3.90%), యాక్సిస్ బ్యాంక్ (3.57%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.51%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.57%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.48%).

బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఏసియన్ పెయింట్స్ (-0.18%) మాత్రమే నష్టపోయింది.

More Telugu News