Telangana: తెలంగాణలో కొత్తగా 193 మందికి కరోనా పాజిటివ్

  • గత 24 గంటల్లో 40,018 కరోనా పరీక్షలు
  • గ్రేటర్ హైదరాబాదులో 73 కొత్త కేసులు
  • ఒకరి మృతి
  • ఇంకా 3,630 మందికి చికిత్స
Telangana corona update

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 40,018 శాంపిళ్లు పరీక్షించగా, 193 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 153 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,76,187 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,68,564 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,630 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,993కి పెరిగింది.

  • Loading...

More Telugu News