Corona Virus: భారీగా త‌గ్గిన కొత్త‌ క‌రోనా కేసుల సంఖ్య‌

  • నిన్న దేశంలో 6,990 క‌రోనా కేసులు
  • 190 మంది క‌రోనాతో మృతి
  • మొత్తం మ‌ర‌ణాల సంఖ్య  4,68,980
  • 123,25,02,767 క‌రోనా డోసుల‌ వినియోగం
corona bulletin in inida

దేశంలో కొత్త క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. నిన్న దేశంలో 6,990 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న‌ 190 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. నిన్న‌ 10,116 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.

ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,00,543 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం 3,40,18,299 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,68,980గా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 123,25,02,767 క‌రోనా డోసుల‌ను వినియోగించారు.

More Telugu News