Corona Virus: దేశంలో భారీగా త‌గ్గిన కొత్త క‌రోనా కేసుల సంఖ్య‌

  • నిన్న‌ 8,318 క‌రోనా కేసులు
  • నిన్న‌ 465 మంది మృతి
  • మొత్తం 4,67,933 మంది మృతి
  • 121.06 కోట్ల క‌రోనా వ్యాక్సిన్ డోసులు వినియోగం
corona bulletin in inida

దేశంలో కొత్త‌ క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. నిన్న‌ 8,318 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న‌ 10,967 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే, నిన్న‌ 465 మంది క‌రోనాతో మృతి చెందారు.

ప్ర‌స్తుతం దేశంలో 1,07,019 మంది క‌రోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,39,88,797 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. క‌రోనాతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,67,933 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు 121.06 కోట్ల క‌రోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించారు.

More Telugu News