Corona Virus: దేశంలో మ‌ళ్లీ 10 వేల‌కు పైగా కొత్త క‌రోనా కేసులు

  • నిన్న‌ 10,549 క‌రోనా కేసులు
  • నిన్న క‌రోనాతో 488 మంది మృతి
  • మొత్తం కేసుల సంఖ్య‌ 3,45,55,431
  • మొత్తం మృతుల సంఖ్య‌ 4,67,468కి చేరింది.
corona bulletin in inida

దేశంలో మ‌ళ్లీ కొత్త‌గా 10 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న‌ 10,549 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న ఒక్క రోజులో క‌రోనాతో 488 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా నుంచి మ‌రో 9,868 మంది కోలుకున్నారు.

ప్ర‌స్తుతం ఆసుప‌త్రుల్లో క‌రోనాకు 1,10,133 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం కేసుల సంఖ్య‌ 3,45,55,431కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి 3,39,77,830 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య‌ 4,67,468కి చేరింది. మొత్తం 63,71,06,009 క‌రోనా టెస్టులు చేశారు.

More Telugu News