తెలంగాణలో మరో 147 కరోనా కేసులు నమోదు
- గత 24 గంటల్లో 33,836 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 56 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,531 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,148 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,67,631 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,531 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,986కి పెరిగింది.
