Telangana: తెలంగాణలో మరో 103 మందికి కరోనా

  • గత 24 గంటల్లో 22,902 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 49 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,575 మందికి చికిత్స
Telangana corona update

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,902 కరోనా పరీక్షలు నిర్వహించగా, 103 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 49 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 153 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,74,555 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,66,999 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,575 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,981కి పెరిగింది.

More Telugu News