Andhra Pradesh: ఏపీలో కొత్తగా 174 మందికి కరోనా పాజిటివ్

  • గత 24 గంటల్లో 24,659 కరోనా పరీక్షలు
  • కృష్ణా జిల్లాలో 32 మందికి పాజిటివ్
  • ఇంకా 2,265 మందికి చికిత్స
AP Corona daily report

ఏపీలో గడచిన 24 గంటల్లో 24,659 కరోనా పరీక్షలు నిర్వహించగా, 174 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 32 కొత్త కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 31, చిత్తూరు జిల్లాలో 29, గుంటూరు జిల్లాలో 26 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 301 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,71,244 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,54,553 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,265 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,426గా ఉంది.

More Telugu News