Telangana: తెలంగాణలో మరో 122 మందికి కరోనా

Telangana corona report
  • గత 24 గంటల్లో 25,847 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 46 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 3,764 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,847 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 46 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 10 కేసులు గుర్తించారు. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, సూర్యాపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 171 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,489 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,64,759 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,764 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,966కి పెరిగింది.
Telangana
Corona Virus
Media Bulletin
Today Cases

More Telugu News