Telangana: తెలంగాణలో కొత్తగా 151 కొవిడ్ కేసుల నమోదు

  • గత 24 గంటల్లో 33,226 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 45 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 3,838 మందికి చికిత్స
Telangana corona cases media bulletin

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 33,226 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 151 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 45 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 16, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12, రంగారెడ్డి జిల్లాలో 10 కేసులు గుర్తించారు. వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, నిర్మల్, నారాయణపేట, మెదక్, జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 190 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,203 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,64,402 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,838 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 3,963కి పెరిగింది.

More Telugu News