West Indies: టీ20 వరల్డ్ కప్: శ్రీలంకతో మ్యాచ్... విజయమే లక్ష్యంగా బరిలోకి వెస్టిండీస్

  • కొనసాగుతున్న సూపర్-12
  • గ్రూప్-1లో వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక
  • ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించిన లంక
  • విండీస్ ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ ఆశలు సజీవం
West Indies eyes on win over Sri Lanka to secure semis chances

నేడు టీ20 వరల్డ్ కప్ లో మరో మ్యాచ్ జరుగుతోంది. అబుదాబి వేదికగా శ్రీలంకతో వెస్టిండీస్ తలపడనుంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన శ్రీలంక ఈ మ్యాచ్ లో గెలిస్తే వెస్టిండీస్ సెమీస్ అవకాశాలను దెబ్బతీస్తుంది తప్ప మరే ప్రయోజనంలేదు.

గ్రూప్-1లో ఇప్పటివరకు 3 మ్యాచ్ లు ఆడిన వెస్టిండీస్ మిగతా రెండు మ్యాచ్ లలోనూ గెలిస్తే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అందుకే ఆ జట్టు నేటి మ్యాచ్ లో గెలవాలన్న కృతనిశ్చయంతో ఉంది. లంకతో మ్యాచ్ కోసం ఆ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఇక శ్రీలంక జట్టులో లహిరు కుమార స్థానంలో బినుర ఫెర్నాండోను తీసుకున్నారు.

More Telugu News