Telangana: తెలంగాణలో కొత్తగా 121 మందికి కరోనా

  • గత 24 గంటల్లో 25,021 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 55 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 4,009 మందికి చికిత్స
Telangana corona media bulletin

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,021 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 121 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాదులోనే 55 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లాలో 10 కేసులు గుర్తించగా, వనపర్తి, వికారాబాద్, నిర్మల్, మహబూబాబాద్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకోగా, 1 మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,71,463 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,63,498 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,009 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,956కి పెరిగింది.

More Telugu News