టీడీపీ నేత బ్రహ్మం చౌదరికి 14 రోజుల రిమాండ్.. గుంటూరు సబ్ జైలుకు తరలింపు
- తనను నిర్బంధించారంటూ బ్రహ్మం చౌదరిపై సీఐ నాయక్ ఫిర్యాదు
- ఈ కేసులో ఏ6గా బ్రహ్మం చౌదరి
- నిన్నంతా చౌదరిని వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పిన పోలీసులు
ఈ క్రమంలో నిన్న టీడీపీ పిలుపునిచ్చిన ఏపీ బంద్ సందర్భంగా ఉండవల్లిలో బ్రహ్మం చౌదరి ఆందోళన చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్నంతా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పారు. ఈరోజు ఉదయం మంగళగిరి పీఎస్ కు ఆయనను తీసుకొచ్చారు. అనంతరం మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు.
కోర్టు విచారణ సందర్భంగా పోలీసులు తనను దుర్భాషలాడారని, మేడికొండూరు సీఐ మారుతీ కృష్ణ తనను కొట్టారని న్యాయమూర్తికి బ్రహ్మం చౌదరి ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో, ఆయనను గుంటూరు సబ్ జైలుకు తరలించారు.