Telangana: తెలంగాణలో మరో 122 మందికి కరోనా

  • గత 24 గంటల్లో 26,676 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 55 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,924 మందికి చికిత్స
Telangana corona daily update

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,676 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కరోనా కేసులు నమోదు కాగా, జిల్లాల్లో ఎక్కడా రెండంకెల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మెదక్, ములుగు, నారాయణపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కకొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 176 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,68,955 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,61,093 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,924 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,938కి పెరిగింది.

More Telugu News