Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

  • కొత్త‌గా 15,981 క‌రోనా కేసులు
  • నిన్న క‌రోనాతో 166 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,51,980
  • మొత్తం కేసుల సంఖ్య‌ 3,40,53,573
corona bulletin in inida

దేశంలో కొత్త‌గా 15,981 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న 17,861 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య‌ 3,33,99,961కు చేరింది. నిన్న క‌రోనాతో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,51,980 కి చేరుకుంది.

అలాగే, దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 3,40,53,573గా నమోదైంది. ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,01,632 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక దేశంలో నిన్న 8,36,118 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు వేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 97,23,77,045కి చేరింది.

More Telugu News