CM Jagan: ఏపీలో 100 శాతం సీటింగ్ తో సినిమా ప్రదర్శనలకు అనుమతి... సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన మైత్రీ మూవీ మేకర్స్

  • ఏపీలో కరోనా మార్గదర్శకాల విడుదల
  • సినిమా ప్రదర్శనలపై ఆంక్షల తొలగింపు
  • దసరాకు పెద్ద సినిమాల విడుదల
  • సినీ రంగానికి ఊరట
Mythri Movie Makers thanked CM Jagan

ఏపీలో కరోనా మార్గదర్శకాలు సవరించిన నేపథ్యంలో, సినిమా హాళ్లలో 100 శాతం సీటింగ్ తో ప్రదర్శనలకు అనుమతి ఇచ్చారు. అలాగే, రోజుకు 4 ప్రదర్శనలపై ఆంక్షలు ఎత్తివేశారు. సీట్ల మధ్య ఖాళీలు వదలాలన్న నిబంధనను తొలగించారు.

ఈ నేపథ్యంలో, టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. ఏపీ సీఎం జగన్ కు, మంత్రి పేర్ని నానిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంది. సినిమా హాళ్లలో 100 శాతం సీటింగ్ తో ప్రదర్శనలు, 4 షోస్ కు అనుమతించడం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమ పునర్నిర్మాణం దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారని కొనియాడింది. ఈ దసరాకు పలు పెద్ద సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సినిమా రంగానికి పెద్ద ఊరట అని చెప్పాలి.

More Telugu News