Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అస్వస్థత... ఎయిమ్స్ కు తరలింపు

  • నిన్నటి నుంచి మన్మోహన్ కు జ్వరం
  • ఇవాళ బాగా నీరసించిన మాజీ ప్రధాని
  • ఆరోగ్యం నిలకడగానే ఉందన్న ఎయిమ్స్ వర్గాలు
  • ఈ ఏడాది ఆరంభంలో కరోనా బారినపడ్డ మన్మోహన్
Former prime minister Manmohan Singh admitted to the AIIMS

మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, నీరసంతో బాధపడుతున్న మన్మోహన్ ను ఈ సాయంత్రం ఢిల్లీలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. మన్మోహన్ కు నిన్న జ్వరంరాగా, ఇవాళ బాగా నీరసించారు.

ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. 89 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఆరంభంలో కరోనా బారినపడ్డారు. కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా కరోనా పాజిటివ్ రావడంతో ఆయనకు ఎయిమ్స్ లోనే చికిత్స అందించారు.

More Telugu News