Andhra Pradesh: ఏపీలో మరో 624 మందికి కరోనా పాజిటివ్

AP Corona Media Bulletin
  • గత 24 గంటల్లో 38,312 కరోనా పరీక్షలు
  • తూర్పుగోదావరి జిల్లాలో 151 కొత్త కేసులు
  • రాష్ట్రంలో నలుగురి మృతి
  • ఇంకా 7,944 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 38,312 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 624 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 151 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 87, గుంటూరు జిల్లాలో 87, నెల్లూరు జిల్లాలో 66 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 8 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 810 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,57,252 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,35,054 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 7,944 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,254కి పెరిగింది.
Andhra Pradesh
Corona Virus
Today Cases
Deaths

More Telugu News