Telangana: తెలంగాణలో మరో 218 కరోనా కేసుల నమోదు

Telangana corona bulletin
  • గత 24 గంటల్లో 46,578 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 69 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 4,390 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 46,578 కరోనా పరీక్షలు నిర్వహించగా, 218 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 69 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, కరీంనగర్ జిల్లాలో 14, నల్గొండ జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 248 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,66,971 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,58,657 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,390 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,924కి పెరిగింది.
Telangana
Corona Virus
Media Bulletin
New Cases

More Telugu News