Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

  • కొత్త‌గా 22,842 క‌రో నా కేసులు
  • నిన్న క‌రోనాతో 244 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,48,817
  • కేర‌ళ‌లో నిన్న ఒక్క‌రోజులోనే  13,217 కేసులు
corona bulletin in inida

దేశంలో కొత్త‌గా 22,842 క‌రో నా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. 25,930 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,30,94,529కి చేరింది. నిన్న క‌రోనాతో 244 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,48,817కి పెరిగింది.  

ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,70,557 మంది చికిత్స తీసుకుంటున్నారు. కేర‌ళ‌లో నిన్న ఒక్క‌రోజులోనే 13,217 మందికి క‌రోనా సోకింది. ఆ రాష్ట్రంలో క‌రోనాతో నిన్న‌ 121 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 90,51,75,348 క‌రోనా వ్యాక్సిన్ డోసుల‌ను వినియోగించారు.

More Telugu News