Bandi Sanjay: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు బండి సంజ‌య్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

  • డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట ప్ర‌జ‌ల‌ను కేసీఆర్ మ‌భ్య‌పెడుతున్నారు
  • కేసీఆర్ సారు.. ఇండ్లు ఎప్పుడిస్తరు?
  • బాధ్య‌తగ‌ల పార్టీగా ప్ర‌జ‌ల ప‌క్షాన బీజేపీ త‌ర‌ఫున రేపు మ‌రిన్ని ప్ర‌శ్న‌లు  
bandi sanjay slams trs

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించారు. డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట ప్ర‌జ‌ల‌ను కేసీఆర్ మ‌భ్య‌పెడుతున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. కొన్ని రోజులుగా కేసీఆర్‌కు బండి సంజ‌య్‌ వ‌రుస‌గా లేఖ‌లు రాస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ రోజు డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి ఆయ‌న లేఖ రాస్తూ 'కేసీఆర్ సారు.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడిస్తరు?' అని ప్ర‌శ్నించారు. ఈ విష‌యంపై అనేక ప్ర‌శ్న‌లు సంధించారు. బాధ్య‌త గ‌ల పార్టీగా ప్ర‌జ‌ల ప‌క్షాన బీజేపీ త‌ర‌ఫున రేపు మ‌రిన్ని ప్ర‌శ్న‌లు అడుగుతాన‌ని ఆయ‌న చెప్పారు.

          

More Telugu News