భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం ఎత్తేసిన కెనడా
- భారత్లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మొదలైన్ బ్యాన్
- రేపటి నుంచి ప్యాసింజర్ విమానాలకు అనుమతి
- ప్రయాణానికి 18 గంటల ముందు కరోనా టెస్టు చేయించుకోవాలని నిబంధన
అయితే భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు అనుమతి పొందిన ల్యాబొరేటరీల నుంచి కరోనా నెగిటివ్ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని కెనడా సూచించింది. ఈ పరీక్షలను ప్రయాణానికి 18 గంటల ముందు చేయించుకోవాలని చెప్పింది. కాగా, భారత్ నుంచి మూడు విమానాల్లో కెనడా చేరిన ప్రయాణికులు అందరూ కరోనా నెగిటివ్గా తేలారు. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.